ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
బాన్సువాడ మున్సిపాలిటీలో వీడ్కోలు సమావేశం
బాన్సువాడ, బతుకమ్మ : ప్రజలకు మనం చేసిన పనులే శాశ్వతంగా ఉంటాయని, పదవులు శాశ్వతం కాదని ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాన్సువాడ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో శనివారం సభ్యుల వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ పదవీకాలంలో విజయవంతంగా పూర్తి చేశన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ కాసుల బాలరాజు, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, కమిషనర్ హరిరాజు, తహసిల్దార్ వరప్రసాద్, వార్డ్ సభ్యులు ,జిల్లా కామారెడ్డి జిల్లా మైనారిటీ అధ్యక్షులు ఖలేఖ్, కృష్ణ రెడ్డి, ఎజాస్, అంజి రెడ్డి, జిల్లా యువజన అధ్యక్షులు మధు, గోపాల్ రెడ్డి, షాహబ్, అజీమ్, పిట్ల శ్రీధర్, నార్ల రవీందర్, నార్ల సూరి, గుడాల నగేష్, డైరెక్టర్ సాయిలు, మన్నన్, రాయిస్, జహీర్, నాయకులూ, ప్రజా ప్రతినిదులు, తదితరులు పాల్గొన్నారు.
