హైదరాబాద్, బతుకమ్మ: కల్తీ కల్లు ఘటనలో మృతుల సంఖ్య పదికి చేరింది. తాజాగా గాంధీ ఆస్పత్రి లో చికిత్స పొందుతున్న గంగామణి అనే మహిళ మృతి చెందింది. మృతురాలిని హైదర్నగర్-రాంనరేష్ నగర్ కు చెందిన మహిళగా గుర్తించారు. కల్లు దుకాణాలపై ఎక్సైజ్ శాఖ దాడులు కొనసాగుతున్నాయి.