నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : హైదరాబాద్ బిర్లా ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించిన కళాకార్ బాలరత్న అవార్డు 2025కు ఇందూరు నృత్య కళాకారిణి తేలి విభశ్రీ (కామాఖ్య) ఎంపికయ్యారు. తన దైన శైలి తో శాస్త్రీయ నృత్యం, వెస్ట్రన్, ఫోక్ తో పాటు పలు టీవీ షోలు, పలు సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గా, యాడ్ షోలు అలాగే ఫ్యాషన్ షోలు ఇచ్చినందుకు గాను మల్టిపుల్ టాలెంటెడ్ గర్ల్ గా “బాలరత్న అవార్డ్ 2025 సయ్యద్ మీర్ కెమెరామెన్, ట్వింకిల్ కపూర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ అవార్డ్ రావడం పట్ల చిన్నతనం నుండి కష్టపడి తన వెన్నంటి ఉంటు తనను ప్రోత్సహిస్తున్న తల్లి తండ్రులకు అంకితం చేస్తున్నానని విభ శ్రీ తెలిపింది.