పుణ్యక్షేత్రాల వద్ద ఇందూరు చిన్నారుల నృత్య ప్రదర్శన

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఇందూరు పట్టణానికి చెందిన ధనిత్ డాన్స్ అకాడమి నాట్య గురువులు పేరిణి సతీష్ శిష్య బృందం 20 మంది చిన్నారులు   అయెధ్య, వారణాసి, అస్సిగాట్లైన పుణ్యక్షేత్రాల వేదికల వద్ద నృత్య ప్రదర్శన చేసి అక్కడి ఆహుతులను అలరించారు.  కార్యక్రమ  నిర్వహకులు చిన్నారులను అభినందించి జ్ఞాపికలు, ప్రశంస పత్రాలను అందించారు. అనంతరం నాట్య గురువు పేరణి సతీష్ ని సన్మానించారు. ఈ కార్యక్రమంలో చిన్నారుల తల్లి తండ్రులు తదితరులు పాల్గొన్నారు.