Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 December 2025, 12:48 pm Posted by : ramakrishna

మన్మోహన్ కు నివాళులు అర్పించిన సీడబ్ల్యూసీ

డిల్లీ, బతుకమ్మ : డిల్లీలోని ఇందిరాభవన్ లో  ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన సీడబ్ల్యూసీ సమావేశం శనివారం ప్రారంభమైంది. ఈ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పలువురు నేతలు హాజరయ్యారు. మన్మోహన్ సింగ్ వర్ధంతి నేపథ్యంలో సీడబ్ల్యూసీ సభ్యులు ఆయనకు నివాళులు అర్పించారు. ఇటీవల మృతి చెందిన సీనియర్ నేతలు శివరాజ్ పాటిల్, శ్రీప్రకాశ్ జైస్వాల్‌లకు సీడబ్ల్యూసీ సంతాపం ప్రకటించింది.


CWC pays tribute to Manmohan