హైదరాబాద్, బతుకమ్మ:
తెలంగాణ రాష్ట్ర డిజిపిగా సివి ఆనంద్ నియమితులు అయ్యారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ అదేశాల మేరకు, ఎంప్యానల్ మెంట్ కమిటి సూచనలతో సివి ఆనంద్ ను రాష్ట్ర కొత్త డిజిపిగా నియమిస్తు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రామక్రిష్ణ రావు మంగళవారం జిఓ ఆర్ టి నెంబర్ 553 ఉత్తర్వులు జారీ చేశారు. 1991 ఐపిఎస్ క్యాడర్ కు చెందిన సివి ఆనంద్ ప్రస్తుతం డిజిపిగా ఉన్న శివధర్ రెడ్డి ఈ నెలాఖరున పదవి విరమణ చేయగానే డైరెక్టర్ జనరల్ ఆప్ పోలీస్ గా బాధ్యతలు స్వీకరిస్తారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి సివి ఆనంద్ పోలీస్ శాఖలో ఐపిఎస్ హోదాలో పనిచేస్తున్నారు. తెలంగాణలో సివి ఆనంద్ హైదరాబాద్ పోలిస్ కమీషనర్ గా, ఎసిబి డిజీగా, హోమంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి హోదాలో పనిచేశారు.
