Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 May 2025, 2:41 pm Posted by : ramakrishna

జీలుగ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలి

మోర్తాడ్, బతుకమ్మ : జీలుగ విత్తనాలు 50శాతం సబ్సిడీపై అందిస్తున్నామని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ సింగిరెడ్డి రాజేశ్వర్ అన్నారు. మోర్తాడ్ మండలం శెట్ పల్లి పీఏసీఎస్ ఆధ్యర్యంలో రైతులకు సబ్సిడీ ద్వారా జీలుగు విత్తనాల పంపిణీని శనివారం ప్రారంభించారు. విత్తనాలు అవసరం ఉన్న రైతులు పట్టా పాస్ బుక్, ఆధార్ కార్డు జిరాక్స్ లు వెంట తీసుకువచ్చి విత్తనాలు తీసుకెళ్లాలని సూచించారు. 30కిలోల బస్తా ధర రూ.2137.50 ఉంటుందని, ఒక బస్తా విత్తనాలు రెండున్నర ఎకరాలకు సరిపోతాయని తెలిపారు. కార్యక్రమంలో సహకార సంఘం వైస్ చైర్మన్ సుదర్శన్, మోర్తాడ్ వ్యవసాయాధికారి హరీశ్ కుమార్, కార్యదర్శి రఘు, రైతులు తదితరులు పాల్గొన్నారు.