సి ఎస్ సి ఆధార్ సేవ కేంద్రాన్ని ప్రారంభించిన అదనపు కలెక్టర్
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆదర్శ నగర్ లో సి ఎస్ సి ఆధార్ సేవ కేంద్రాన్ని మంగళవారం అదనపు కలెక్టర్ (రెవెన్యూ ) ఎస్ . కిరణ్ కుమార్ ప్రారంభించారు . ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ...కామన్ సర్వీసు సెంటర్ ద్వారా నెలకొల్పబడిన సెంటర్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలనందించాలని సూచించారు . ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నిటికి ఆధార్ ముఖ్యమని ప్రజలు సైతం ఈ ఆధార్ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు . కార్యక్రమంలో నిజామాబాదు మున్సిపల్ కమిషనర్ మకరందు...