ఢిల్లీ, బతుకమ్మ: పాకిస్థాన్ తో యుద్ధ వాతావరణం నేపథ్యంలో దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి త్రివిద దళాల బలగాలను కేంద్రం దేశ సరిహద్దుల్లోకి రప్పిస్తోంది. ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు విడుదల చేయడంతో కర్రె గుట్టల్లో ‘ఆపరేషన్ కగార్ ’లో బిజీగా ఉన్న సీఆర్పీఎఫ్ బలగాలు దశల వారీగా వెనక్కి వెళ్తున్నాయి. ఆదివారం ఉదయం లోగా బలగాలను దేశ సరిహద్దులకు చేరనున్నాయి. దీంతో కర్రెగుట్టల్లో తుపాకుల మోత నిలిచిపోనుంది. ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్ కగార్ పై పడింది.