ఈడీ విచారణకు హాజరైన క్రికెటర్ శిఖర్‌ ధావన్‌

వెబ్ న్యూస్, బతుకమ్మ :  బెట్టింగ్ యాప్స్ కేసు విచారణ ముమ్మరంగా సాగుతోంది. భారత మాజీ క్రికెటర్ శిఖర్ తాజాగా ఈకేసులో ఈడీ ఎదుట విచారణ కు హజరయ్యాడు. పీఎంఎల్ఎ చట్టం ప్రకారం అతడి నుంచి స్టేట్ మెంట్ ను ఈడీ రికార్డు చేసింది. ఇల్లీగల్ యాప్స్ కు ప్రమోషన్ చేయడం వెనకు ఏదైన ఆర్థిక కుట్ర ఉందా అని విచారణ చేపట్టినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ,ఈకేసులో ఇప్పటికే భారత క్రికెటర్లు, సినీ తారలను ఈడీ విచారించిన విషయం తెలిసిందే.