దుబాయ్ నుంచి క్రికెట్ బెట్టింగ్.. ఐదుగురు బుకీల అరెస్ట్

వెబ్ న్యూస్,బతుకమ్మ  :  దుబాయి వేదికగా  జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ పై  బెట్టింగ్స్ జోరందుకున్నాయి . దుబాయ్ నుంచి నడుస్తున్న ఈక్రికెట్ బెట్టింగ్ లో రూ. 5 వేల కోట్లు చేతులు మారబోతున్నట్లు సమాచారం. విశ్వసనీయ సమాచారం మేరకు ఐదుగురు బుకీలను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి పోలీసులు రూ. 22 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.