Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 March 2025, 10:21 pm Posted by : ramakrishna

కనిపించిన నెలవంక.. రేపటి నుంచి రంజాన్

నిజామాబాద్, బతుకమ్మ : రంజాన్ పవిత్రమాసం ఆదివారం నుండి ప్రారంభమవనుంది. దేశంలోని అన్నీ ప్రాంతాల్లో నెలవంక శనివారం కనిపించడంతో ఆదివారం నుంచి ముస్లింలు ఉపవాస దీక్షలు చేపట్టనున్నారు. కాగా, రోజా పాటించే ముస్లింలు నమాజ్‌కు మొదటి ప్రాధాన్యతనిస్తారు. నమాజ్‌ కోసం అన్ని మసీదుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సహర్‌ నుంచి ఇఫ్తార్‌ వరకు ఉపవాసదీక్షలు పాటిస్తారు. రోజుకు ఐదుపూటల నమాజు చేస్తారు. ‘తరావీహ్‌’ నమాజులో ఖురాన్‌ పఠనం చేస్తారు.