ప్రజావాణిలో 38 ఫిర్యాదులను స్వీకరించిన సీపీ

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   నిజామాబాద్ పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఫిర్యాదు దారుల నుండి 38 ఫిర్యాదులను నగర పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదు దారుల నుండి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత పోలీస్ స్టేషన్ ల ఎస్.ఐ, సి.ఐ లకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని తెలుసుకుని, పరిష్కారానికి సూచనలు చేశారు. ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి...