Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 January 2026, 7:45 pm Posted by : ramakrishna

ఇందూర్ తిరుమలలో ఏకాంత సేవలో సీపీ దంపతులు

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ఇందూరు తిరుమలలో ప్రతి శనివారం జరిగే విశేష ఏకాంత సేవలో కమిషనర్ ఆఫ్ పోలీస్ సాయి చైతన్య దంపతులు పాల్గొన్నారు. అనంతరం స్వామివారికి వింజమర సేవ చేశారు. సీపీ సాయి చైతన్య మాట్లాడుతూ ఇందూర్ తిరుమల ఆలయం అద్భుతంగా ఉందని అచ్చు తిరుమలలో ఉన్నట్టు అనుభూతి పొందానని అన్నారు. సమయం చిక్కితే తప్పకుండా మళ్ళీ మళ్ళీ వస్తామని అన్నారు. ఈ సేవలో వారితో పాటు మోపాల్ ఎస్సై ఆలయ ప్రధాన అర్చకులు రోహిత్ కుమార్, ఆచార్య నరాల సుధాకర్, విజయ స్వామి, అనిల్ స్వామి, భాస్కర్, రాజేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.