ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
కరీంనగర్, బతుకమ్మ : కరీంనగర్ లో ని అంబేడ్కర్ స్టేడియంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. గ్రాడ్యుయేట్ ఎన్నికల పరిశీలకులు బుద్ధ ప్రకాష్ జ్యోతి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు బెన్హర్ మహేష్ దత్ ఎక్కా, ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీలో ఉన్న అభ్యర్థులు, వారి ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ ల సీల్లను ఓపెన్ చేశారు.