గాంధారిలో నకిలీ నోట్ల కలవరం

బతుకమ్మ, గాంధారి : కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో నకిలీ నోట్లు బయట పడడంతో జిల్లాలో కలకలం రేపింది. గాంధారి మండలంలోని చద్మల్ తండాలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. చద్మల్ తాండలో గల లక్ష్మమ్మ ఆలయంలో ప్రతీ సంక్రాంతి సమయంలో 13, 14, 15 తేదీలలో మూడు రోజుల పాటు జాతర నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అమ్మవారికి భక్తులు హుండీలో కానుకలు చెల్లించుకుంటారు. హుండీ ఆదాయం లెక్కింపులో వచ్చిన నగదును తండా వాసులకు తక్కువ వడ్డీకి అప్పుగా ఇస్తారు. ఈసారి కూడా ఆలయ...