ముప్కాల్, బతుకమ్మ: ముప్కాల్ మండలం వేంపల్లి గ్రామంలో పలువురు ఆత్మీయుల కుటుంబాలను మంగళవారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు ఆరేపల్లి మురళి వల్ల అమ్మ చనిపోవడంతో కుటుంబ సభ్యులను, అలాగే బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు ఆరెపల్లి భోజన్న కు కాలేయ సంబంధిత ఆపరేషన్ కావడంతో వారిని, ఆరేపల్లి నర్సు బాయి క్యాన్సర్ తో మరణించడంతో ఆమె కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
