Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 October 2024, 7:03 pm Posted by : ramakrishna

నేడు డీఎస్సీ 2024 లో ఎంపికైన అభ్యర్థులకు కౌన్సిలింగ్ 

 నిజామాబాద్ , బతుకమ్మ:  డిఎస్సీ 2024 ఉపాధ్యాయ నియమాకంలో అర్హత సాధించి అపాయింట్ మెంట్ లు పొందిన అభ్యర్ధులకు మంగళవారం కౌన్సిలింగ్ కు హజరు కావాలని జిల్లా విద్యాశాఖాధికారి దుర్గా ప్రసాద్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని కొత్త కలెక్టరేట్ ప్రాంగణంలోని రూమ్ నంబర్ 103 నందుకు ఎస్ జిటి సత్ససమాన క్యాడర్ లోని అన్ని మీడియంలలోని ఉపాధ్యాయులకు, పండిత్ లకు, పిఇటిలకు కౌన్సిలింగ్ ఉంటుందని తెలిపారు. స్కూల్ అసిస్టెంట్ క్యాడర్ ఉపాధ్యాయులకు  రూమ్ నంబర్ 117 లో కౌన్సిలింగ్ ఉంటుందని పెర్కోన్నారు. ఉదయం 9 గంటల వరకు కౌన్సిలింగ్ హల్ కు హజరు కావాలని కొరారు. కౌన్సిలింగ్ కు అభ్యర్థులకు మాత్రమే అనుమతి ఉంటుందని , సినియార్టి జాబితాను జిల్లా విద్యాశాఖాధికారి వేబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు.