బతుకమ్మ,మెండోరా: మెండోరా మండలంలోని సావెల్ గ్రామానికి చెందిన రాజారపు రాజన్న, వెల్కటూ ర్ గ్రామానికి చెందిన కోటల పెద్ద గంగారం ఇటీవల అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జి ముత్యాల సునీల్ రెడ్డి ఇరువురి కుటుంబాలను శనివారం పరామర్శించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.