బాధిత కుటుంబాన్ని పరామర్శ

ఎల్లారెడ్డి, బతుకమ్మ  ఎల్లారెడ్డి మండలంలోని వెల్లుట్ల గ్రామానికి చెందిన చీకుల   సైదులు తండ్రి చీకుల నర్సింలు గురువారం అనారోగ్యంతో స్వర్గస్థులైనారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు  వెల్లుట్ల సంతోష్ కుమార్ సైదులు కుటుంబాన్ని పరామర్శించి, కుటుంబానికి మనోధైర్యం కల్పించి  ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు యామ రాజయ్య,నాయకులు ఒట్లం భూమయ్య, నర్వ శంకర్, ఒట్లం ప్రకాష్ తదితరులున్నారు.