బతుకమ్మ, మోర్తాడ్: మోర్తాడ్ మండలం పాలెం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాలెం రూపొందించిన 2025 సంవత్సరపు క్యాలెండర్ ను శనివారం నిజామాబాద్ జిల్లా విద్యాధికారి అశోక్ ఆవిష్కరించడం జరిగింది. 2025 సంవత్సరం వాల్ క్యాలెండర్ లో ఈ విద్యా సంవత్సరం పాఠశాలలో జరిగినటువంటి, సెల్ఫ్ డీఫేన్స్ ట్రైనింగ్, ఎడ్యుకేషనల్ టూర్, స్టూడెంట్స్ అండ్ టీచర్స్ ఫొటోస్ తో రూపొందించిన క్యాలెండర్ బాగుందని విద్యాధికారి పేర్కొన్నారు. ఇలాంటి వినూత్న కార్యక్రమాలతో తల్లిదండ్రులకు నమ్మకం కలిగిస్తూ, నాణ్యమైన విద్యను అందించినట్లయితే విద్యార్థుల అడ్మిషన్స్ పెరుగుతాయని, ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెరుగుతుందని తెలియజేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం శాలువాతో సన్మానించడం జరిగినది. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా పరీక్షల విభాగం అధికారి విజయ భాస్కర్, ఉన్నత పాఠశాల పాలెం ప్రధానోపాధ్యాయులు పల్లెపాటి. గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు వేణుగోపాలరావు, అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేష్, పీ ఆర్ టీ యూ తెలంగాణ జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్, ఉపాధ్యాయులు మహేష్ కుమార్, చంద్రశేఖర్, రాజేందర్, సైఫ్ అలీ తదితరులు పాల్గొన్నారు.
