డ్రగ్స్ నిర్మూలనకు నిరంతరం దాడులు కొనసాగించాలి
. . . పోలీస్ కమిషనర్ సాయి చైతన్య బోధన్, బతుకమ్మ : డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక దాడులు నిరంతరం కొనసాగించాలని, అక్రమ రవాణాలో పాల్గొనే వారిపై పీడీ యాక్ట్ వంటి కఠిన చట్టాల కింద చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. బోధన్ డివిజన్ పరిధిలో నేరాల నియంత్రణ, పెండింగ్ కేసుల పురోగతి, శాంతిభద్రతల పరిరక్షణపై బుధవారం సమగ్ర సమీక్ష నిర్వహించారు. కోటగిరి పోలీస్ స్టేషన్లో జరిగిన ఈ సమావేశంలో...