బతుకమ్మ,మెండోరా: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద కాలువ ద్వారా నీటి విడుదల నిలిపివేసినట్లు ప్రాజెక్టు అధికారి రవి తెలిపారు. కాకతీయ కాలువ ద్వారా 4,500 క్యూసెక్కులు, లక్ష్మీ కాలువ ద్వారా 250 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 700 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు, 80.5 టిఎంసిలు కాగా ఆదివారం రోజు 1081.00 అడుగులు, 47.847 టీఎంసీల నీరు నిలువ ఉంది.