Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 May 2025, 9:27 am Posted by : ramakrishna

పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని ఢీకొన్న కంటైనర్ లారీ

 

… కానిస్టేబుల్ దుర్మరణం

శంషాబాద్, బతుకమ్మ

వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసు పెట్రోలింగ్ వాహనాన్ని శంషాబాద్ వద్ద కంటైనర్ లారీ ఢీకొంది. శంషాబాద్ మండలం షాపూర్ హైవే పై  ఎస్వీఆర్ ఫంక్షన్ హాల్ సమీపంలో  శనివారం రాత్రి రెండు పెట్రోలింగ్ వాహనాలతో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక కారును డికోన్న కంటైనర్ పక్కన ఉన్న డివైడర్ ను డి కొట్టి పక్కన ఓరిగింది. ఈ ఘటనలో విజయ్ కుమార్ అనే కానిస్టేబుల్ దుర్మరణం చెందారు. మరో ముగ్గురు కానిస్టేబుల్ లకు గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతి చెందిన విజయ్ కుమార్ శంషాబాద్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్నారు.