Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 November 2024, 9:42 pm Posted by : ramakrishna

కంటైనర్ డికోని హెడ్ కానిస్టెబుల్ దుర్మరణం

ఆర్మూర్, బతుకమ్మ :

ఆర్మూర్ లో పెర్కిట్ బైపాస్ వద్ధ కంటైనర్ డికోని ఎఆర్ హెడ్ కానిస్టెబుల్ దుర్మరణం చెందాడు. ఈ సంఘటన బుదవారం రాత్రి జరిగింది. ఆర్మూర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సత్యనారాయణ గౌడ్  కధనం ప్రకారం… ఆర్మూర్ పట్టణానికి చెందిన  రాథోడ్ ప్రతాప్ సింగ్ హైవే పెట్రోల్ డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. బాల్కొండ వైపు నుంచి ఆర్మూర్ వైపు వస్తు పెర్కిట్ బైపాస్ వద్ద రోడ్డు క్రాస్ చేస్తుండగా హైదరాబాద్  నుంచి నిర్మల్  వెలుతున్న కంటైనర్ లారీ ( హెచ్ ఆర్ 55 ఏ ఆర్ 5612 ) అతి వేగంగా డికోట్టింది.  ఈ ప్రమాధంలో ప్రతాప్ సింగ్ కు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాదానికి కారణమైన కంటైనర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడని, కేసు నమోదు చేసి  దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.