బతుకమ్మ, మెండోరా: మెండోరా మండలంలోని వెల్కటూర్ గ్రామంలో ఆదివారం పలు బాధిత కుటుంబాలను బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పరామర్శించారు. గ్రామానికి చెందిన బాలుడు యశ్వంత్ ఇటీవల ఈత కొరకు వెళ్ళి ప్రమాదవశాత్తు బావిలో పడి చనిపోయారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని ప్రకటించారు. అదే గ్రామానికి చెందిన కుమ్మరి రాములు అనారోగ్యంతో మరణించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలపడం జరిగింది. గ్రామానికి చెందిన వెంకటేశ్ గౌడ్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని ప్రకటించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
