Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 March 2025, 7:57 pm Posted by : ramakrishna

బాధిత కుటుంబాల పరామర్శ

బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండలంలోని పాలెం గ్రామంలో పలు బాధిత కుటుంబాలను ఆదివారం బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పరామర్శించారు.  కొత్తపల్లి నర్సారెడ్డి వాళ్ళ అత్తమ్మ గంగు ఇటీవల అనారోగ్యంతో మరణించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని ప్రకటించారు. అదే గ్రామానికి చెందిన టీచర్ రాజేందర్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలపడం జరిగింది. అలాగే దోన్ పాల్ గ్రామానికి చెందిన సంజీవ రెడ్డి వాళ్ళ అమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించారు.వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలపడం జరిగింది. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Consultation with the families of the victims