నిజామాబాద్, బతుకమ్మ : నగరంలోని పాత గంజ్ లో గల పూరి జగన్నాథ్ మండప నిర్మాణ పనులను గురువారం నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్పగంగారెడ్డి ప్రారంభించారు. ఇస్కాన్ నిజామాబాద్ ద్వారకా నగర్ ఆధ్వర్యంలో జూన్ 20 నుంచి 27 వరకు జరగనున్న 8వ జగన్నాథ రథయాత్ర, భాగవత సప్తాహ ఉత్సవాల నేపథ్యంలో ఈపనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ నిజామాబాద్ అధ్యక్షులు శ్రీమాన్ సిద్ధబలరాం దాస్ , ఏఎంసీ సెక్రటరీ అపర్ణ, గ్రేడ్ 2 సెక్రటరీ శ్రీధర్, నిజామాబాద్ జిల్లా ప్రముఖులు, ఇస్కాన్ భక్త బృందం పాల్గొన్నారు.