బతుకమ్మ,మెండోరా: దేశ ప్రజలకు సమాన హక్కులను కల్పించిన భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయ పౌరుడు మీద ఉన్నదని బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్ అన్నారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్, ముప్కాల్ మండలం రెంజర్ల, మెండోర మండలం బుస్సాపూర్ గ్రామాలలో నిర్వహించిన జై బాపు..జై భీమ్.. జై సంవిధాన్ కార్యక్రమ పాదయాత్రలో ఆయన పాల్గొనడం జరిగింది. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.