కామారెడ్డి, బతుకమ్మ : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్ రవి కుమార్ అంత్యక్రియలు అధికారులు పోలీస్ లాంఛనాలతో గురువారం సాంయత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని దేవుని పల్లి వైకుంఠధామంలో నిర్వహించారు. పోలీసుల గౌరవ వందనంతో అంతిమ వీడ్కోలు పలికారు. అంత్యక్రియల్లో ఎస్పీ రాజేష్ చంద్ర, ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ రావు, సీఐ సంతోష్, గాంధారి ఎస్సై ఆంజనేయలు పాల్గొన్నారు.