మానవత్వం చాటుకున్న కానిస్టేబుల్
బతుకమ్మ భిక్కనూరు: మండల కేంద్రంలోని ఎన్ హెచ్ 44 హైవే టోల్ ప్లాజా సమీపంలో సాయంత్రం వెహికల్ చెకింగ్ చేస్తున్న పరంధాములు కానిస్టేబుల్ కు ఫోన్ దొరకడంతో బాధితునికి పిలిపించి ఫోన్ ఇవ్వడం జరిగింది. కానిస్టేబుల్ మాట్లాడుతూ ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తులు పోలీస్ స్టేషన్ కు వచ్చి స్టేషన్లో ఫిర్యాదు చేయాలన్నారు. సి ఈ ఐ ఆర్ పోర్టల్ సహాయంతో వాటిని రికవరీ చేస్తామన్నారు. మానవత్వం చాటిన కానిస్టేబుల్ ని పలువురు కొనియాడారు.