కానిస్టేబుల్ కిష్టయ్య ఉద్యమానికి ఊపిరి పోశారు
బాన్సువాడ , బతుకమ్మ : పోలీస్ కానిస్టేబుల్ కిష్టయ్య తన ప్రాణాలను పణంగాపెట్టి తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోశారని రాష్ర్ట ఆగ్రో ఇండస్ర్టీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ అన్నారు. కిష్టయ్య 15వ వర్ధంతి సందర్భంగా బాన్సువాడ పట్టణంలోని ఆయన విగ్రహానికి పూలలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఖాలేక్, నాయకులు అంజిరెడ్డి, ఎజాస్, కౌన్సిలర్ లింగమేశ్వర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.