కమ్మర్ పల్లి, బతుకమ్మ :
మండలంలోని నర్సాపూర్ గ్రామానికి చెందిన రెండు బాధిత కుటుంబాలను బాల్కొండ కాన్సిస్టెన్సీ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ బుధవారం పరామర్శించారు. ఇందులో భాగంగా నర్సాపూర్ గ్రామానికి చెందిన గంగాధర్ కూతురు లక్ష్మి ఇటీవలే మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. అదే గ్రామానికి చెందిన మండల శేఖర్ వాళ్ళ నాన్న అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన వెంట మండల, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.