Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 August 2024, 4:13 pm Posted by : ramakrishna

13న ప్రాంతీయ సదస్సును జయప్రదం చేయండి

  • ఐఎఫ్టియు యూనియన్ జిల్లా అధ్యక్షులు మచ్చ మోహన్

బతుకమ్మ, నిజామాబాద్ : కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై సెప్టెంబర్ 13న నిజామాబాదులో జరుగు ప్రాంతీయ సదస్సును జయప్రదం చేయాలని తెలంగాణ ప్రగతిశీల వ్యవసాయ మార్కెట్ హమాలి ఆధ్వర్యంలో (ఐఎఫ్టియు) నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మచ్చ మోహన్ పిలుపునిచ్చారు. సోమవారం నిజామాబాద్. శ్రద్ధానంద్ గంజ్ వ్యవసాయ కూరగాయల మార్కెట్లో తెలంగాణ ప్రగతిశీల హమాలీ &. మిల్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు. ఎం శివకుమార్. పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక 4లేబర్ కోడ్ లను,3నేర చట్టాల సవరణలను రద్దు చేయాలని అనారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని ఐఎఫ్టియు జాతీయ కమిటీ పిలుపుమేరకు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే ఉమ్మడి నిజామాబాద్. అదిలాబాద్, కామారెడ్డి, నిర్మల్. జిల్లాల. ప్రాంతీయ సదస్సుకు అన్ని రంగాల కార్మికులు హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
సమావేశంలో . హమాలి కార్మికులు. మల్లేష్. వీరయ్య. రైస్. శంకర్. గంగాధర్. వకీల్. రసూల్. ధర్మయ్య. అంజి . సోను భాయ్. తదితరులు పాల్గొన్నారు.