బతుకమ్మ,బాల్కొండ: బాల్కొండ మండల కేంద్రంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల అధ్యక్షుడు గున్నాల వెంకటేశ్ ఆధ్వర్యంలో బిజెపి మాజీ ఎంపీ రమేష్ బేదురి కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా రహదారిపై ధర్నా నిర్వహించారు. అనంతరం మాజీ ఎంపీ రమేష్ దిష్టిబొమ్మను దహనం చేసి బిజెపి పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎంపీ రమేష్ బీదురిని వెంటనే బిజెపి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో బాల్కొండ మండలం కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.