రేపు కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం

హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ లోని శంషాబాద్  నోవాటెల్ లో మంగళవారం ఉదయం 11 గంటలకు  తెలంగాణ కాంగ్రెస్  శాసనసభాపక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈసీఎల్పీ సమావేశం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనుంది. భూ భారతి, సన్న బియ్యం, ఇందిరమ్మఇళ్లు, ఎస్సీ-ఎస్టీ వర్గీకరణ అంశాలపై చర్చ జరగనుంది. ఈమేరకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రభుత్వ విప్ లు సమాచారమిచ్చారు.