ఎమ్మెల్యే భూపతి రెడ్డిని పరామర్శించిన కాంగ్రెస్ నేతలు

నిజామాబాద్ రూరల్,బతుకమ్మ : నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డిని ఆయన క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పరామర్శించారు. శనివారం జిల్లా గ్రంధాల చైర్మన్ అంత రెడ్డి రాజా రెడ్డి, మాజీ జడ్పీటీసీ పుప్పాల శోభా, బ్రహ్మ కుమారి సుజాత సిస్టర్, పలు పి.ఎ.సి.ఎస్ చైర్మన్‌లు, ఎ.ఎం.సి డైరెక్టర్లు, రూరల్ నియోజకవర్గంలో అన్ని మండలాల కాంగ్రెస్ అధ్యక్షుడు, గ్రామ శాఖ అధ్యక్షుడు ఎమ్మెల్యే తల్లి రేకులపల్లి లక్ష్మీ నరసమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.