కేసీఆర్ ఫాంహౌస్ ను ముట్టడించిన కాంగ్రెస్ నేతలు
గజ్వేల్, బతుకమ్మ: గజ్వేల్ లోని ఎర్రవల్లి కేసీఆర్ ఫాంహౌస్ ను సిద్దిపేట డీసీసీ అధ్యక్షురాలు ఆంక్ష రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం కాంగ్రెస్ నేతలు ముట్టడించారు. కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లి గజ్వేల్ ప్రజల సమస్యల పరిష్కారం కోసం మాట్లాడాలంటూ కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. అసెంబ్లీకి వెళ్లకుంటే కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.