Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 November 2025, 5:16 pm Posted by : ramakrishna

ప్రజలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం

మోర్తాడ్, బతుకమ్మ: రాష్ట్ర ప్రజలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ ఉంటుందని మోర్తాడ్ మండల అధ్యక్షుడు ముత్యాల రాములు అన్నారు. మోర్తాడ్ మండలంలోని దోన్ పాల్ గ్రామంలోని లబ్ధిదారులకు బుధవారం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, నియోజకవర్గం ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.