కరీంనగర్, బతుకమ్మ: పట్టభద్రుల నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా మహాశక్తి దేవాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. నరేందర్ రెడ్డికి గురువారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డి బీ ఫామ్ అందజేసిన విషయం తెలిసిందే.
