Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 November 2025, 11:19 am Posted by : ramakrishna

గాంధీభవన్ లో కాంగ్రెస్ శ్రేణుల సంబురాలు

హైదరాబాద్, బతుకమ్మ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో  కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యంలో దూసుకెళ్తుడటంతో హైదరాబాద్ లోని గాంధీభవన్ లో  బాణా సంచా కాల్చి కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు ప్రారంభించారు.  ఐదు రౌండ్లు ముగిసే సరికి 12,651 ఓట్ల ఆధిక్యంలో నవీన్ యాదవ్ కొనసాగుతున్నారు. రెండో స్థానంలో మాగంటి సునీత ఉన్నారు.