కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల బాహబాహీ.. ధర్మారంలో ఉద్రిక్తత
పెద్దపల్లి జిల్లాలో.. ధర్మారం, బతుకమ్మ : పెద్దపల్లి జిల్లా ధర్మారంలో కాంగ్రెస్, బీఆర్ ఎస్ పోటా పోటీ ప్రదర్శనలతో ఉద్రిక్తత నెలకొంది. మండలంలో తామంటే తామే అభివద్ధి కార్యక్రమాలు చేపట్టామంటూ ఇరు పార్టీల నేతలు బహిరంగ చర్చలకు సవాళ్లు చేసుకున్నారు. ఈక్రమంలో పట్టణంలోని ప్రధాన కూడలి వద్దకు వారు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు అక్కడికి చేరుకొని ఇరు పార్టీల నేతలను నియంత్రించారు.