రైతు కమిషన్ సభ్యుడు గడుగుకు సన్మానం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: రాష్ర్ట రైతు కమిషన్ సభ్యుడు, న్యాయవాది గడుగు గంగాధర్ ను బార్ కౌన్సిల్ ఆధ్వర్యంలో మంగళవారం సన్మానించారు. ఈ సందర్భంగా గడుగు గంగాధర్ జిల్లా న్యాయమూర్తి సునీత కుంచాలను మర్యాదపూర్వకంగా కలిశారు. న్యాయమూర్తికి పుష్పగుచ్ఛం అందజేసి సన్మానించారు. కార్యక్రమంలో న్యాయవాదులు ఆశ నారాయణ, మధుసూదన్ రావు, రాజ్ కుమార్ సుబేదార్ తదితరులు పాల్గొన్నారు.