తె.వి.వి.పాలక మండలి సభ్యుడు డా.దండు స్వామికి ఉన్నతాధికారుల అభినందనలు

  డిచ్ పల్లి, బతుకమ్మ :   తెవివి పాలక మండలి సభ్యుడిగా ఎన్నికైన డా.దండు స్వామి సోమవారం ఉన్నతాధికారులను మర్యాదపూర్వకంగా కలిసారు. తెలంగాణ రాష్ట్ర కళాశాల విద్య సంయుక్త సంచాలకులు ప్రొఫెసర్ బాలభాస్కర్, ప్రొఫెసర్ రాజేంద్ర సింగ్, అకడమిక్ గైడెన్స్ ఆఫీసర్ ప్రొఫెసర్ రాజేంద్రప్రసాద్, పూర్వ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తదితర ఉన్నతాధికారులను మర్యాదపూర్వకంగా కలిసారు.     అనంరతం వారు డా.దండు స్వామికి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.