బాన్సువాడ , బతుకమ్మ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుల గణన సర్వేను శనివారం బాన్సువాడ పట్టణంలోని 14వ వార్డులో స్థానిక కౌన్సిలర్ నార్ల నంద కిశోర్ ప్రారంభించారు. నాయకులు అబ్దుల్ వహబ్, ఎండీ దావూద్, సర్వే సూపర్ వైజర్ సుభాష్, ఎన్యుమరేటర్ అబ్దుల్ రజాక్, బాగ్బాన్ అధ్యక్షుడు కాజీమ్, కలీం తదితరులు పాల్గొన్నారు.