క్షేత్రస్థాయి విద్యారంగ సమస్యలపై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక
తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : క్షేత్రస్థాయి విద్యారంగా సమస్యలపై తెలంగాణ ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేస్తామని తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో క్షేత్రస్థాయి ఉన్నత విద్యారంగ సమస్యలను సమగ్రంగా ప్రభుత్వానికి నివేదించడానికి తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ఐఏఎస్ ఆధ్వర్యంలో ప్రజావాణిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ ఇంజనీరింగ్ కాలేజ్ ని, ఫార్మసి కాలేజ్ ని మంజూరు చేయించాలన్నారు....