నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో రూపొందించిన 2026 సంవత్సర కాలమానిని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ కుమార్ చేతుల మీదుగా శనివారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఘనంగా ఆవిష్కరించారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కే. రాజు మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్, కోశాధికారి ప్రసాద్, సంఘం నాయకులు చిన్నారెడ్డి, సాయికుమార్, బాబు, రవి కిరణ్, మోహన్ రమేష్, సమగ్ర శిక్ష సూపరిండెంట్ మురళి, సెక్టోరిల్ అధికారులు శ్రీనివాసరావు, జీవన్, బాలకృష్ణ, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.