Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 March 2025, 5:29 pm Posted by : ramakrishna

బాపూజీ వచనాలయంపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు ఫిర్యాదు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బాపూజీ వచనాలయంపై తక్షణమే చర్య తీసుకోవాలని బాపూజీ వచనాలయ పరిరక్షణ పోరాట సమితి కన్వీనర్ కోనేరు సాయికుమార్, సామాజిక కార్యకర్త బాపూజీ వచనాలయ పరిరక్షణ సమితి సభ్యులు బంగారు సాయిలు, రాజేందర్, రవి కలెక్టర్ కు మెమోరాండం అందజేశారు. బాపూజీ వచనాల రిజిస్ట్రేషన్ నంబరు రిజిస్టర్ కాలేదని దానికి సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలు ఎలాంటి డాక్యుమెంట్స్ మా వద్ద లేవని వారిచ్చిన లెటర్ ని కాపీ జత చేశామని తెలిపారు. బాపూజీ వచనాలయం పాలక వర్గం చేస్తున్న అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరామని తెలిపారు.