నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: నగరంలోని 57వ డివిజన్ పరిధిలో ఉన్న ఏక్ మినార్ (డి-54కెనాల ఎదురుగా) వద్ద ఓ వ్యక్తిని రోడ్డును ఆక్రమించి కోకా ఏర్పాటు చేయడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. రోడ్డుపై కోకా ఏర్పాటు చేయడంతో ఎదురెదురుగా వస్తున్న వాహనాలు కనిపించడం లేదని, స్కూల్ పిల్లలు ప్రమాదాల బారిన పడుతున్నారన్నారు. వెంటనే స్పందించి ఆక్రమణను తొలగించి స్థానికుల సమస్యను పరిష్కరించాలని అమ్జద్ ఖాన్, అమేర్ ఖాన్, అమర్ బిన్ అహ్మద్, సయ్యద్ వాసి, జావెద్ బిన్ సల్మాన్, ఇంతియాజ్ఖాన్, సయ్యద్ సమీ తదితరులు ఫిర్యాదులో పేర్కొన్నారు.
