కేటీఆర్ పై ఓయూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

హైదరాబాద్, బతుకమ్మ :  గ్రూప్-1 పోస్టులను రూ.2 కోట్లకు అమ్ముకున్నారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై  టీపీసీసీ జెన్రల్ సెక్రటరీ చనగాని దయాకర్ ఓయూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు  చేశారు.  ప్రభుత్య ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా కేటిఆర్ వ్యాఖ్యలు చేశారని విమర్శించారు.  24 గంటల్లో కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.  లేకపోతే రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు.